ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం

నేటి భారత్ న్యూస్- అమెరికా ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నడుంబిగించారు. ఇందులో భాగంగా అమెరికాలో ఎన్నికలు నిర్వహించే విధానంలో గణనీయమైన మార్పులను కోరుతూ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. ఓటర్లు తమ అమెరికన్ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని తాజా ఆర్డర్ ఆదేశిస్తుంది. అలాగే, ఎన్నికల రోజు నాటికి అందిన మెయిల్-ఇన్, లేదా, గైర్హాజరీ బ్యాలెట్లను మాత్రమే లెక్కించాలని ఇది చెబుతోంది. అమెరికన్ పౌరులు కాని వారు విరాళం ఇవ్వకుండా ఇది అడ్డుకుంటుంది. భారతదేశం, బ్రెజిల్ వంటి దేశాల్లో ఎన్నికల నిర్వహణ తీరును ప్రస్తావిస్తూ.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు రెండింటిలోనూ ఇప్పటికే ప్రామాణికమైన ‘ప్రాథమిక, అవసరమైన ఎన్నికల రక్షణలను’ అమలు చేయడంలో అమెరికా విఫలమవుతోందని ట్రంప్ పేర్కొన్నారు. భారత్, బ్రెజిల్ దేశాలు ఓటరు గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్‌కు అనుసంధానిస్తున్నాయి. అయితే, అమెరికా మాత్రం ఇప్పటికీ పౌరసత్వం కోసం స్వీయ ధ్రువీకరణపై ఆధారపడుతోందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాలెట్ ప్రాసెసింగ్ విషయంలో అమెరికా అనుసరిస్తున్న అస్థిర విధానాన్ని ట్రంప్ విమర్శించారు.  మోసం, లోపాలు, లేదా అనుమానాలు లేని స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, నిజాయతీ గల ఎన్నికలు మన రాజ్యాంగ గణతంత్రాన్ని కాపాడుకోవడానికి ప్రాథమికమైనవని ట్రంప్ నొక్కి వక్కాణించారు. 

Related Posts

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

నేటి భారత్ న్యూస్- అనకాపల్లి జిల్లాలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. దేవరాపల్లి గ్రామం వద్ద పొలాల్లో 15 అడుగుల కింగ్ కోబ్రా రైతులను భయభ్రాంతులకు గురిచేసింది. పొలాల్లోకి వచ్చిన ఆ భారీ విషసర్పాన్ని కుక్కలు నిలువరించాయి. దాంతో ఆ పాము…

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

నేటి భారత్ న్యూస్- ప్రస్తుతం ఆన్ లైన్ లో బ్యాంకింగ్ వ్యవహారాలకు అవకాశం ఉన్నా, చాలామంది ప్రజలు బ్యాంకుల ద్వారానే ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుంటారు. అలాంటి వారు బ్యాంకులకు సెలవులు ఎప్పుడు వస్తాయన్నది ఓ అవగాహనతో ఉండడం మంచిది. కాగా, ఏప్రిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

 తెనాలిలో స‌మంత‌కు గుడి క‌ట్టిన అభిమాని.

 తెనాలిలో స‌మంత‌కు గుడి క‌ట్టిన అభిమాని.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ర‌వీంద్ర‌ జ‌డేజా అరుదైన రికార్డ్‌.. తొలి ప్లేయ‌ర్‌గా ఘ‌న‌త‌!

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ర‌వీంద్ర‌ జ‌డేజా అరుదైన రికార్డ్‌.. తొలి ప్లేయ‌ర్‌గా ఘ‌న‌త‌!

కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భానుడి ఉగ్రరూపం… ఐఎండీ అప్ డేట్

కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భానుడి ఉగ్రరూపం… ఐఎండీ అప్ డేట్

ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 500 కి.మీ. పరుగులు పెట్టే ఎలక్ట్రిక్ కారు.. త్వరలో మార్కెట్లోకి తేనున్న మారుతి సుజుకీ

ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 500 కి.మీ. పరుగులు పెట్టే ఎలక్ట్రిక్ కారు.. త్వరలో మార్కెట్లోకి తేనున్న మారుతి సుజుకీ