ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

నేటి భారత్ న్యూస్- రేప‌టి నుంచి ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం కానుంది. ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా, బెంగ‌ళూరు మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌తో టోర్నీకి తెర‌లేవ‌నుంది. ఈ క్ర‌మంలో టీమిండియా మాజీ క్రికెట‌ర్ సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో 500 ప‌రుగులు చేస్తే భార‌త జ‌ట్టులో చోటు ద‌క్కే అవ‌కాశ‌ముంద‌ని అన్నాడు. ఐపీఎల్ కేవ‌లం భార‌త్‌లోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు పొందింద‌న్నాడు. యువ ఆట‌గాళ్లు తిల‌క్ వ‌ర్మ‌, య‌శ‌స్వి జైస్వాల్‌, రింకూ సింగ్‌కు తాను పెద్ద అభిమాని అని చెప్పాడు. ఇప్పుడు వ‌స్తున్న క్రికెట‌ర్లు అద్భుత‌మైన టాలెంట్‌తో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెడుతున్నార‌ని తెలిపాడు. ఇప్ప‌టికే చాలా మంది ప్లేయ‌ర్లు త‌మ టాలెంట్‌ను ప్ర‌ద‌ర్శించి అంత‌ర్జాతీయ టోర్నీల్లో స‌త్తా చాటార‌ని పేర్కొన్నాడు. 2024లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన టీమిండియా, ఈ ఏడాది ఛాంపియ‌న్స్ ట్రోఫీ గెల‌వ‌డం చాలా బాగుంద‌న్నాడు. వ‌రుస‌గా రెండు ఐసీసీ టోర్నీలు గెల‌వ‌డం మాములు విష‌యం కాద‌న్నాడు. ఈ సంద‌ర్భంగా రైనా యంగ్ ప్లేయ‌ర్ల‌కు కీల‌క సూచ‌న చేశాడు. వ‌ర్త‌మానంలో ఉండి ఆట‌పై దృష్టిపెడితే చాలు అవ‌కాశాలు వాటంతట‌వే వ‌స్తాయ‌న్నాడు. నిల‌క‌డ‌గా ఆడితే త‌ప్ప‌కుండా గుర్తింపు ల‌భిస్తుంద‌ని తెలిపాడు.  ఐపీఎల్ ఒక సీజ‌న్‌లో 500 ర‌న్స్ చేస్తే త‌ప్ప‌కుండా జాతీయ జ‌ట్టులో ఆడే అవ‌కాశం వ‌స్తుంద‌న్నాడు. ఐపీఎల్ వంటి భారీ వేదిక‌పై మంచి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిస్తే వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌సరం ఉండ‌ద‌న్నాడు. ఇక మిస్ట‌ర్ ఐపీఎల్‌గా పేరొందిన రైనా… 2007 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌, 2013 ఛాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచిన భార‌త జట్టులో స‌భ్యుడు అనే విష‌యం తెలిసిందే. 

Related Posts

 ఐపీఎల్ ప్రారంభానికి ముందు వివాదానికి తెరతీసిన ఆర్సీబీ..

నేటి భారత్ న్యూస్- ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ సరికొత్త వివాదానికి తెరలేపింది. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ మార్పును ఎగతాళి చేస్తున్నట్టుగా ఉన్న ఆర్సీబీ వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కింది. ఇది కాస్తా వైరల్ కావడంతో ఆర్సీబీ చిక్కుల్లో పడింది.…

నేటి నుంచే ఐపీఎల్ మ‌హాసంగ్రామం.. టాప్‌లో వీరే..!

నేటి భారత్ న్యూస్- నేటి నుంచి మ‌హాసంగ్రామానికి తెర‌లేవ‌నుంది. క్రికెట్ ఫ్యాన్స్ పండ‌గలా భావించే ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఇవాళ ప్రారంభం కానుంది. అయితే, 2008లో మొద‌టి సీజ‌న్‌తో ప్రారంభ‌మైన ఈ మ‌హాసంగ్రామం ఈ ఏడాది 18వ సీజ‌న్‌లోకి అడుగుపెట్టింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

 చెన్నైలో మాఫియా ముఠా సమావేశం జరుగుతోంది.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అనుకొనే హాజరయ్యారు: బండి సంజయ్

 చెన్నైలో మాఫియా ముఠా సమావేశం జరుగుతోంది.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అనుకొనే హాజరయ్యారు: బండి సంజయ్

ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు.. లేఖ విడుద‌ల చేసిన జ‌న‌సేన

ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు.. లేఖ విడుద‌ల చేసిన జ‌న‌సేన