క్షుద్ర పూజలు.. ముంబైలోని లీలావతి ఆసుపత్రి ట్రస్టీల సంచలన ఆరోపణలు

నేటి భారత్ న్యూస్– ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుత ట్రస్టీలు బాధ్యతలు చేపట్టినప్పుడు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులను ప్రస్తుత ట్రస్టీల కార్యాలయం కింద ఉంచారని కొంతమంది ఉద్యోగులు చెప్పడంతో, సాక్షుల సమక్షంలో వీడియో చిత్రీకరణ చేస్తూ నేలను తవ్వి చూడగా ఎనిమిది కుండలు బయటపడ్డాయని వెల్లడించారు. వాటిలో మానవ అవశేషాలు, ఎముకలు, వెంట్రుకలు, బియ్యం మరియు క్షుద్ర పూజలకు ఉపయోగించే ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆశ్రయించగా వారు నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించామని, కోర్టు విచారణకు ఆదేశించిందని ఆయన తెలిపారు.ముంబయిలోని ప్రతిష్ఠాత్మక లీలావతి ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగం వెలుగులోకి రావడంతో ట్రస్టీలు దిగ్భ్రాంతికరమైన ఆరోపణలు చేశారు. లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ ప్రస్తుత సభ్యులు, పూర్వ ట్రస్టీలు రూ.1,200 కోట్ల నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఆసుపత్రి ఆవరణలో క్షుద్ర పూజలు కూడా జరిగాయని, ప్రస్తుత ట్రస్టీల కార్యాలయం కింద ఎముకలు, మనిషి వెంట్రుకలు కలిగిన ఎనిమిది కుండలను గుర్తించామని వారు పేర్కొన్నారు. ఈ ట్రస్ట్ పోలీసులకు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేసింది. పూర్వ ట్రస్టీలపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఆర్థిక అవకతవకలు బాంద్రా ఆసుపత్రి కార్యకలాపాలను ప్రభావితం చేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్షుద్ర పూజలకు సంబంధించిన ఫిర్యాదు ఆధారంగా బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, దీనిపై మెజిస్ట్రేట్ విచారణ జరుపుతున్నారని ట్రస్ట్ శాశ్వత నివాస ట్రస్టీ ప్రశాంత్ మెహతా తెలిపారు. లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ యొక్క సమగ్రతను కాపాడటానికి, ఆరోగ్య సంరక్షణ సేవలకు ఉద్దేశించిన నిధులను రోగుల కోసమే వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెల్లడైన దుష్ప్రవర్తన, ఆర్థిక దుర్వినియోగం అనేది ట్రస్ట్ యొక్క విశ్వాసాన్ని వమ్ము చేయడమే కాకుండా, ఆసుపత్రి లక్ష్యానికి ప్రత్యక్ష ముప్పు అని ఆయన అన్నారు. ఆడిట్ వెల్లడించిన విషయాలు సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ప్రస్తుత ట్రస్టీలు ట్రస్ట్ యొక్క నియంత్రణను చేపట్టారు. చేతన్ దలాల్ ఇన్వెస్టిగేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, ఏడీబీ అండ్ అసోసియేట్స్ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాయి. ఆడిట్‌లో పూర్వ ట్రస్టీలు పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని, నిధులను తారుమారు చేశారని, పక్కదారి పట్టించారని తేలింది. క్షుద్ర పూజల ఆరోపణలు ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుత ట్రస్టీలు బాధ్యతలు చేపట్టినప్పుడు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులను ప్రస్తుత ట్రస్టీల కార్యాలయం కింద ఉంచారని కొంతమంది ఉద్యోగులు చెప్పడంతో, సాక్షుల సమక్షంలో వీడియో చిత్రీకరణ చేస్తూ నేలను తవ్వి చూడగా ఎనిమిది కుండలు బయటపడ్డాయని వెల్లడించారు. వాటిలో మానవ అవశేషాలు, ఎముకలు, వెంట్రుకలు, బియ్యం మరియు క్షుద్ర పూజలకు ఉపయోగించే ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆశ్రయించగా వారు నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించామని, కోర్టు విచారణకు ఆదేశించిందని ఆయన తెలిపారు.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్