నేటి భారత్ న్యూస్- మహబూబాబాద్ జిల్లాలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని గూడూరు మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ టెంట్ హౌస్ గోడౌన్ కు బుధవారం అర్ధరాత్రి నిప్పంటుకుంది. దీంతో గోడౌన్ లోని దాదాపు పది లక్షల విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. మెరుగు భరత్ గౌడ్ సౌండ్స్ అండ్ డెకరేషన్ టెంట్ హౌజ్ గోడౌన్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోడౌన్ లోని ఎల్ఈడీ లైటింగ్ వైర్లు, సర్వీసు వైర్లు, సౌండ్ సిస్టం తదితర ఎలక్ట్రికల్ సామన్లు, ఇతర విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదం కారణంగా సుమారు 10 లక్షల నష్టం వాటిల్లిందని టెంట్ హౌస్ నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు.