

నేటి భారత్ న్యూస్- మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసింది. ఈ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం పూజా కార్యక్రమం ఉగాది రోజున జరగనుందని తెలుస్తోంది. ఈ వార్త మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేకకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం కామెడీ ఓరియెంటెడ్ గా ఉంటుందని… ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభంకానుందని, 2026 సంక్రాంతికి సినిమా విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తుండగా… భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.