

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు, ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు. 14 మంది ఎస్పీలకు స్థానచలనం కలిగింది.కరీంనగర్ పోలీస్ కమిషనర్గా గౌస్ ఆలం, అదనపు డీజీ (పర్సనల్)గా అనిల్ కుమార్లను నియమించారు. అనిల్ కుమార్కు ఎస్పీఎఫ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఐడీ ఐజీగా శ్రీనివాసులు, వరంగల్ సీపీగా సన్ప్రీత్ సింగ్, నిజామాబాద్ సీపీగా సాయిచైతన్య, రామగుండం సీపీగా అంబర్ కిశోర్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధుశర్మ, భువనగిరి డీసీపీగా ఆకాంక్ష యాదవ్, మహిళా భద్రతా విభాగం ఎస్పీగా చేతన, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్లను బదిలీ చేసింది.కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర, సంగారెడ్డి ఎస్పీగా పారితోష్ పంకజ్, రాజన్న సిరిసిల్ల ఎస్పీగా జీఎం బాబా సాహెబ్, వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్, మంచిర్యాల డీసీపీగా భాస్కర్, సూర్యాపేట ఎస్పీగా నర్సింహ, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, ఎస్ఐబీ ఎస్పీగా సాయి శేఖర్, పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్, సీఐడీ ఎస్పీగా రవీందర్లు బదిలీ అయ్యారు.