నేటి నుంచే ఐపీఎల్ మ‌హాసంగ్రామం.. టాప్‌లో వీరే..!

నేటి భారత్ న్యూస్- నేటి నుంచి మ‌హాసంగ్రామానికి తెర‌లేవ‌నుంది. క్రికెట్ ఫ్యాన్స్ పండ‌గలా భావించే ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఇవాళ ప్రారంభం కానుంది. అయితే, 2008లో మొద‌టి సీజ‌న్‌తో ప్రారంభ‌మైన ఈ మ‌హాసంగ్రామం ఈ ఏడాది 18వ సీజ‌న్‌లోకి అడుగుపెట్టింది. ఈరోజు ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ (కేకేఆర్‌), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) త‌ల‌ప‌డ‌నున్నాయి. గ‌త 17 ఎడిష‌న్ల‌లో క‌లిపి అత్య‌ధిక ప‌రుగులు, అత్య‌ధిక వికెట్లు, అత్య‌ధిక సెంచ‌రీలు, అత్య‌ధిక సార్లు టోర్నీ విజేత‌, అత్య‌ధిక సిక్స‌ర్లు, అత్య‌ధిక ఫోర్లు, అత్య‌ధిక ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌లు, అత్య‌ధిక క్యాచ్‌లు, అత్య‌ధిక టీమ్ స్కోర్లు ఇలా ప‌లు విభాగాల‌లో టాప్‌లో ఉన్న రికార్డుల‌పై ఇప్పుడు మ‌నం ఓ లుక్కేద్దాం. అత్య‌ధిక ప‌రుగుల రికార్డు ర‌న్‌మెషీన్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. మొద‌టి సీజ‌న్ నుంచి ఆర్‌సీబీకే ఆడుతున్న విరాట్ ఇప్ప‌టివ‌ర‌కూ 8004 ర‌న్స్ చేశాడు. అత్య‌ధిక వికెట్ల రికార్డును స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ క‌లిగి ఉన్నాడు. అత‌ని పేరిట 205 ఐపీఎల్ వికెట్లు ఉన్నాయి. అత్య‌ధిక సెంచ‌రీలు కోహ్లీనే బాదాడు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం ఎనిమిది శ‌త‌కాలు సాధించాడు. అత్య‌ధిక అర్ధ శ‌త‌కాలు డేవిడ్ వార్న‌ర్ (66) న‌మోదు చేశాడు. అత్య‌ధిక సార్లు టోర్నీ విజేత‌గా ముంబ‌యి, చెన్నై ఉన్నాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు చెరో ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచాయి. అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ గేల్ (175). అత్య‌ధిక సిక్స‌ర్ల రికార్డు కూడా ఈ క‌రేబియ‌న్ స్టార్ పేరిట‌నే ఉంది. త‌న ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 357 సిక్సులు బాదాడు. ఇక అత్య‌ధిక ఫోర్ల రికార్డును శిఖ‌ర్ ధావ‌న్ క‌లిగి ఉన్నాడు. అత‌ని పేరిట 768 ఐపీఎల్ ఫోర్లు ఉన్నాయి.  అత్య‌ధిక ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌లు సాధించింది ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ ఏబీ డివిలియ‌ర్స్. ఇప్ప‌టివ‌ర‌కు అత‌ని ఖాతాలో 25 పీఓటీఎం అవార్డులు ఉన్నాయి. అత్య‌ధిక టీమ్ స్కోరు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (287/3). అత్య‌ధిక క్యాచ్‌ల రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు కోహ్లీ 114 క్యాచ్‌లు అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడింది ఎంఎస్ ధోనీ. ఇప్ప‌టివ‌ర‌కు అత‌డు 264 మ్యాచ్‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. అత్య‌ధిక మ్యాచ్‌ల‌కు సార‌థ్యం (226) వ‌హించింది కూడా ఎంఎస్‌డీనే.   

Related Posts

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

నేటి భారత్ న్యూస్- ఏపీ కష్టాల్లో ఉన్న సమయంలో కూటమిని రాష్ట్ర ప్రజలు గెలిపించారని… మొత్తం 175 సీట్లలో 164 సీట్లను కట్టబెట్టి ఘన విజయం అందించారని చెప్పారు. కూటమికి 21 ఎంపీ స్థానాలను కట్టబెట్టారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా…

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

నేటి భారత్ న్యూస్- లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని, డీలిమిటేషన్‌ను ప్రశ్నించని పక్షంలో చరిత్ర తమను క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు జరగనున్న అన్యాయంపై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

 చెన్నైలో మాఫియా ముఠా సమావేశం జరుగుతోంది.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అనుకొనే హాజరయ్యారు: బండి సంజయ్

 చెన్నైలో మాఫియా ముఠా సమావేశం జరుగుతోంది.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అనుకొనే హాజరయ్యారు: బండి సంజయ్

ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు.. లేఖ విడుద‌ల చేసిన జ‌న‌సేన

ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు.. లేఖ విడుద‌ల చేసిన జ‌న‌సేన

పన్నుల రూపంలో భారీగా చెల్లిస్తున్నప్పటికీ తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నాం: రేవంత్ రెడ్డి

పన్నుల రూపంలో భారీగా చెల్లిస్తున్నప్పటికీ తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నాం: రేవంత్ రెడ్డి

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ