నేడు ఆరోగ్య శాఖ కమిషనరేట్ ముట్టడికి ఆశవర్కర్ల పిలుపు .. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు

నేటి భారత్ న్యూస్- తమ డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణలోని ఆశా వర్కర్లు ఈరోజు ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం ఇవ్వాలని, రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబాలకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు ఇవ్వాలని, పదోన్నతులు, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు. ఈ డిమాండ్లపై కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టాలని వారు నిర్ణయించారు. ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ‘చలో హైదరాబాద్’ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆశా వర్కర్లు హైదరాబాద్కు తరలి రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఆదివారం వేకువజాము నుంచే ఆశా వర్కర్లు బయటకు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో ఆశా వర్కర్ల ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. 

Related Posts

 చంద్రబాబుకు మెసేజ్ చేసినా రెస్పాన్స్ రాలేదు: కేఏ పాల్

నేటి భారత్ న్యూస్- రాజమండ్రి శివార్లలో జరిగిన ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మరోవైపు ఆసుపత్రి వద్దకు చేరుకున్న కేఏ పాల్ పోస్టుమార్టం జరుగుతున్న మార్చురీ…

 భ‌ద్రాచ‌లంలో ఘోర ప్ర‌మాదం.. కుప్ప‌కూలిన ఆరంత‌స్తుల భ‌వ‌నం

నేటి భారత్ న్యూస్- భ‌ద్రాచ‌లంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. భ‌ద్రాచ‌లం సూప‌ర్ బ‌జార్ సెంటర్‌లో పంచాయ‌తీ కార్యాల‌యం వ‌ద్ద‌ నిర్మాణంలో ఉన్న ఆరంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు మృతిచెంద‌గా, శిథిలాల కింద న‌లుగురు చిక్కుకున్న‌ట్లు స‌మాచారం. ఈ ప్ర‌మాదానికి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

కుటుంబ గొడవలపై మంచు విష్ణు భార్య విరానిక కీలక వ్యాఖ్యలు

కుటుంబ గొడవలపై మంచు విష్ణు భార్య విరానిక కీలక వ్యాఖ్యలు

 చంద్రబాబుకు మెసేజ్ చేసినా రెస్పాన్స్ రాలేదు: కేఏ పాల్

 చంద్రబాబుకు మెసేజ్ చేసినా రెస్పాన్స్ రాలేదు: కేఏ పాల్

 భ‌ద్రాచ‌లంలో ఘోర ప్ర‌మాదం.. కుప్ప‌కూలిన ఆరంత‌స్తుల భ‌వ‌నం

 భ‌ద్రాచ‌లంలో ఘోర ప్ర‌మాదం.. కుప్ప‌కూలిన ఆరంత‌స్తుల భ‌వ‌నం

ఎంఎంటీఎస్ రైలు అత్యాచారయత్నం, ఉప ఎన్నికల అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి

ఎంఎంటీఎస్ రైలు అత్యాచారయత్నం, ఉప ఎన్నికల అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి