నేటి భారత్ న్యూస్- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనడాన్ని నిషేధించారు. అలాగే, అమెరికా మిలటరీ విభాగంలో ట్రాన్స్జెండర్ల నియామకాన్ని రద్దు చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. నిన్న జరిగిన విచారణలో ట్రంప్ నిర్ణయాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. సమానత్వ సూత్రాన్ని ఉదహరిస్తూ ట్రాన్స్జెండర్లపై నిషేధాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. రాజ్యాంగంలోని ట్రాన్స్జెండర్ల హక్కులను కాలరాసే అధికారం అధ్యక్షుడి ఉత్తర్వులకు ఉన్నప్పటికీ, అది సరికాదని స్పష్టం చేసింది. సృష్టిలోని మానవులందరూ సమానమనే అమెరికా స్వాతంత్ర్య ప్రకటనను ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. ట్రంప్ ఆదేశాలను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. మరోవైపు, టెస్లా, స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) మూసివేతపై దాఖలైన మరో పిటిషన్పైనా నిన్న విచారణ జరిగింది. యూఎస్ ఎయిడ్ మూసివేతను వెంటనే నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది.