ప్రచండ వేగంతో భూమి వైపు దూసుకు వస్తున్న గ్రహశకలం.. ముప్పు రోజురోజుకూ పెరుగుతోందంటున్న నాసా

నేటి భారత్ న్యూస్ – అంతరిక్షంలో ఓ భారీ గ్రహశకలం భూమివైపు దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2023 డిసెంబర్ లోనే ఈ గ్రహ శకలాన్ని గుర్తించామని, దీనిని 2024 వైఆర్4 గా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశం కేవలం 1 శాతమే ఉందని తొలుత అంచనా వేసిన శాస్త్రవేత్తలు.. తాజాగా ఈ ముప్పు రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 40 మీటర్ల నుంచి 90 మీటర్ల పరిమాణంలో ఉన్న ఈ ఆస్టరాయిడ్ 2032 డిసెంబర్ 22 న భూమిని తాకొచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 29న మరోసారి 2024 వైఆర్ 4 కదలికలను పరిశీలించగా భూమిని తాకే ప్రమాదం కేవలం 1 శాతం ఉందని తేలిందన్నారు. అయితే, ఈ నెలలో జరిపిన పరిశోధనలో ఈ ముప్పు 3.2 శాతానికి పెరిగిందని తెలిపారు.భారీ పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం దాదాపు గంటకు 40 వేల మైళ్ల వేగంతో భూమి వైపు దూసుకు వస్తోందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకవేళ ఈ గ్రహశకలం భూమిని ఢీ కొట్టకపోయినా, వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత పేలిపోయినా కూడా ప్రభావం భారీగానే ఉంటుందని చెప్పారు. హిరోషిమాపై వేసిన అణుబాంబుతో పోలిస్తే 500 రెట్లు అధిక ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. గ్రహ శకలం మార్గాన్ని పరిశీలించగా.. ఇది నేరుగా పసిఫిక్ సముద్రంలో లేదా నార్తరన్ సౌత్ అమెరికా, అట్లాంటిక్ సముద్రం, ఆఫ్రికా, అరేబియన్ సముద్రం, దక్షిణాసియాలలో ఏదో ఒకచోట పడుతుందని గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ 2024 వైఆర్ 4 గ్రహశకలం భూమిని తాకే ముప్పు ప్రస్తుతానికి 2.8 శాతం ఉందని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.ఈ గ్రహశకలం భూమిని తాకుతుందా లేక గాలిలోనే పేలిపోతుందా అనే విషయంపై స్పష్టత లేదని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అవసరమైతే గ్రహశకలాన్ని అడ్డుకుని మధ్యలోనే పేల్చివేసేందుకు తగిన సమయం ఉందని చెప్పారు. 2022 లో నాసా అభివృద్ధి చేసిన డిమాన్ స్ట్రేటెడ్ ఆస్టరాయిడ్ డిఫ్లెక్షన్ టెక్నాలజీ (డార్ట్) తో ఈ గ్రహశకలాన్ని దారి మళ్లించవచ్చని పేర్కొన్నారు.

  • Related Posts

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

    నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

     నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

     నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

     యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

     యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

    జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

    జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

     జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

     జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్