మున్సిపాలిటీలకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్

నేటి భారత్ న్యూస్- ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపాలిటీలకు మంత్రి పొంగూరు నారాయణ శుభవార్త చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్‌లో మున్సిపల్ శాఖకు, సీఆర్డీఏ కు అధిక నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వానికి పాలన చేతకాకపోవడంతో కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు సైతం మళ్లించారని, దీంతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇక మున్సిపల్ శాఖ విషయానికి వస్తే ప్రజలు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ప్రజలు చెల్లించే పన్నులు చట్టం ప్రకారం స్వపరిపాలనలో భాగంగా ఆ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయవచ్చని అన్నారు. డ్రెయిన్లు శుభ్రం చేసుకోవడం, తాగు నీటి అవసరాలకు వినియోగించుకోవడం, స్వచ్ఛతా తదితర ప్రజోపయోగకర కార్యక్రమాలకు కౌన్సిల్ ఆమోదంతో ఖర్చు చేసుకోవచ్చని, అయితే గత ప్రభుత్వం స్వపరిపాలనకు చరమగీతం పాడుతూ సీఎఫ్ఎంఎస్‌కు మళ్లించడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయన్నారు. దీంతో కనీసం బ్లీచింగ్ కొనటానికి కూడా నిధులు లేక అల్లాడిపోయే పరిస్థితి నెలకొందని ఆవేధన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రియల్ ఒకటి నుంచి ఏ మున్సిపాల్టీలో వసూలయ్యే పన్నులు ఆ మున్సిపాల్టీయే ఖర్చు చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అమరావతి టెండర్ల ప్రక్రియ ఆలస్యం అయిందని, మార్చి పదో తేదీన టెండర్లు ఖరారు చేసి ఆ తర్వాత పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ప్రణాళికాబద్ధంగా అమరావతి నిర్మాణ పనులు చేస్తామన్నారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రాజధాని స్వయం సమృద్ధి ప్రాజెక్టు అని, ఎక్కడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి అదనంగా ఖర్చు పెట్టడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు కట్టే పన్నుల నుంచి ఒక్క పైసా కూడా దీనికి వినియోగించడం లేదని వారిపై ఎలాంటి భారం లేదని స్పష్టం చేశారు. అందుకే ప్రపంచ బ్యాంకు, ఈడీబీ, హడ్కో లాంటి సంస్థలు రాజధాని నిర్మాణానికి రుణాలు మంజూరు చేశాయని తెలిపారు. అమరావతి సీడ్ కేపిట‌ల్ నుంచి 16 వ నెంబర్ జాతీయ రహదారికి కలిపే రోడ్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభ‌మ‌వుతాయని మంత్రి చెప్పారు. వీటి త‌ర్వాత‌ మధ్యలో నిర్మాణం నిలిచిపోయిన సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం కూడా ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు మంత్రి నారాయ‌ణ వెల్లడించారు.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్