రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట

నేటి భారత్ న్యూస్- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లపై వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదయింది. నార్సింగి పోలీసులు అప్పుడు ఆయనను రిమాండుకు తరలించారు. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనల సందర్భంగా జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. తప్పుడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేసింది. కేటీఆర్‌పై కేసు కొట్టివేత కేటీఆర్‌పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఎంపీ అనిల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్షలతో తనపై కేసు నమోదు చేశారని వాదనల సందర్భంగా కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసింది.

Related Posts

 చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్

నేటి భారత్ న్యూస్- పిఠాపురం నియోజకవర్గంలోన చిత్రాడలో మార్చి 14న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరగడం తెలిసిందే. జయకేతనం పేరిట నిర్వహించిన ఈ సభ విజయవంతంగా ముగిసిన సందర్భంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్…

బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగింది: సీఎం చంద్రబాబు

నేటి భారత్ న్యూస్- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం గురించి చంద్రబాబు ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్

 చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్

రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట

రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట

బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగింది: సీఎం చంద్రబాబు

బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగింది: సీఎం చంద్రబాబు

 మంద కృష్ణతో విభేదాలు లేవు, ఆయన నాకంటే మోదీని ఎక్కువగా నమ్ముతున్నారు: రేవంత్ రెడ్డి

 మంద కృష్ణతో విభేదాలు లేవు, ఆయన నాకంటే మోదీని ఎక్కువగా నమ్ముతున్నారు: రేవంత్ రెడ్డి

ప్రగతి రథానికి పంక్చర్ వేశారు… తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్

ప్రగతి రథానికి పంక్చర్ వేశారు… తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్

కొత్త ఫోన్ ను మార్కెట్లోకి వదిలిన రియల్ మీ… బ్యాంక్ ఆఫర్లతో రూ.2 వేల డిస్కౌంట్!

కొత్త ఫోన్ ను మార్కెట్లోకి వదిలిన రియల్ మీ… బ్యాంక్ ఆఫర్లతో రూ.2 వేల డిస్కౌంట్!