

నేటి భారత్ న్యూస్ – రామ్ గోపాల్ వర్మ సమర్పణలో .. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వంలో ‘శారీ’ సినిమా రూపొందింది. ఈ సినిమా ద్వారా కథానాయికగా ఆరాధ్యదేవి తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ .. “ఇది ఒక సైకలాజికల్ థిల్లర్. ఈ జోనర్ కీ .. టైటిల్ కి పొంతన లేనట్టుగా అనిపిస్తుంది. కానీ రెండిటికీ సంబంధం ఉంది. కథ అంతా కూడా ‘ శారీ’ చుట్టూనే తిరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కథలో ‘శారీ’ రోల్ ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి. అందువల్లనే ఈ సినిమాకి ఈ టైటిల్ ను సెట్ చేసుకోవడం జరిగింది” అని అన్నారు. “అతను ఒక ఫొటోగ్రఫర్ .. ఈ అమ్మాయిని అతను ‘శారీ’లో చూస్తాడు. ఆమె పేరు కూడా అతనికి తెలియదు .. ‘శారీ’ అమ్మాయిగానే గుర్తుపెట్టుకుంటాడు. అప్పటి నుంచి ఆమెను ఫాలో కావడం మొదలుపెడతాడు. రాజమండ్రిలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఆధారంగా ఈ కథను రెడీ చేసుకున్నాను. నేను బిజీగా ఉండటం వలన .. కమల్ పై గల నమ్మకంతో దర్శకత్వం బాధ్యత ఆయనకు అప్పగించాను” అని అన్నారు.