హార్దిక్ పాండ్యా మానసికంగా చిత్రవధ అనుభవించాడు.. బయోపిక్ తీయొచ్చు: మహ్మద్ కైఫ్

నేటి భారత్ న్యూస్ గత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మానసికంగా చిత్రవధ అనుభవించాడని టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. అడ్డంకులను ఎదుర్కొన్ని మళ్లీ అతడు గాడిన పడిన తీరుపై బయోపిక్ తీయొచ్చని తెలిపాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తిరుగులేని విజయాలు అందించిన రోహిత్ శర్మను తప్పించిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసి జట్టు పగ్గాలు అతడికి అప్పగించింది. అతడి కెప్టెన్సీలో జట్టు దారుణ పరాజయాలు చవిచూసింది. కెప్టెన్‌గా పాండ్యా కూడా రాణించలేకపోయారు. రోహిత్‌ను తప్పించి పాండ్యాకు పగ్గాలు ఇవ్వడాన్ని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా అభిమానులు అతడిని హేళన చేశారు. తిట్టిపోశారు. ఫామ్ లేమితో బాధపడుతూ విమర్శలు మూటగట్టుకున్న పాండ్యా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్, తాజాగా జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఫామ్‌లోకి వచ్చి విమర్శకుల నోళ్లు మూయించాడు. అడ్డంకులను, బాధలను ఎదుర్కొని మళ్లీ గాడిన పడిన పాండ్యాపై కైఫ్ ప్రశంసలు కురిపించాడు. పాండ్యా తన బాధల్ని మనసులోనే దాచుకుని ముందుకు సాగాడని, అదే అతడి పునరాగమన కథ అని తెలిపాడు. ఇదొక చెడ్డ ప్రయాణమని అన్నాడు. అభిమానులు అతడిని హేళన చేశారని, ప్రజలు అతడిని తిరస్కరించారని వివరించాడు. ఆటగాడిగా అవమానాలతో ముందుకు సాగడం బాధాకరమన్నాడు. ఒక ఆటగాడు దానిని ఎప్పటికీ మర్చిపోడని పేర్కొన్నాడు. ఆటగాడికి అది మానసిక హింసగా మారుతుందని కైఫ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. పాండ్యా మానసిక క్షోభ అనుభవించాడని, అలాగే, టీ20 ప్రపంచకప్‌లో ఆడి రాణించాడని కైఫ్ ప్రశంసించాడు. ఫైనల్‌లో హెన్రిక్ క్లాసెన్‌ను అవుట్ చేశాడని, చాంపియన్స్ ట్రోఫీలో ఆడం జంపాపై సిక్సర్లు కొట్టాడని గుర్తుచేశాడు. బ్యాట్‌తోను, బంతితోనూ చక్కని ఆటతీరు కనబరిచాడని కొనియాడాడు. సింహంలా పోరాడాడని ప్రశంసించాడు. అతడి బయోపిక్ తీయాలనుకుంటే మాత్రం గత ఏడు నెలలు ఒక ఎత్తు, అంతకుముందు ఐపీఎల్‌లో జరిగిన ఘటనలు మరో ఎత్తని అన్నాడు. తన బలాన్ని నమ్ముకుని జట్టు విజయంలో నిశ్శబ్దంగా తన వంతు పాత్ర పోషించాడని కైఫ్ ప్రశంసించాడు.

Related Posts

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

నేటి భారత్ న్యూస్- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమైన విషయం విదితమే. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అటు నియోజకవర్గానికి కానీ, ఇటు అసెంబ్లీకి కానీ వెళ్లడంలేదు. ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల…

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

నేటి భారత్ న్యూస్త– మిళనాడులోని తిరువణ్ణామలై కొండపై ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫ్రాన్స్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ గత జనవరిలో తిరువణ్ణామలైను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు శుభవార్త.. అందుబాటులోకి 5జీ సేవలు

వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు శుభవార్త.. అందుబాటులోకి 5జీ సేవలు

ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

 గద్దర్ అవార్డులకు సంబంధించి టీఎఫ్‌డీసీ కీలక ప్రకటన

 గద్దర్ అవార్డులకు సంబంధించి టీఎఫ్‌డీసీ కీలక ప్రకటన

భారత్ లో కాలు మోపుతున్న ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీ

భారత్ లో కాలు మోపుతున్న ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీ