హైదరాబాద్ నుంచి అండమాన్ కు… కొత్త ప్యాకేజీ తీసుకువచ్చిన ఐఆర్ సీటీసీ

నేటి భారత్ న్యూస్- అందమైన అండమాన్ నికోబార్ దీవుల్లో విహరించాలని కోరుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. వేసవి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లాలని భావించే వారికి ఈ ప్యాకేజీ అనువుగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో అందమైన బీచ్‌లు, ఆకట్టుకునే దీవులను సందర్శించే అవకాశం కల్పిస్తోంది.ఐఆర్‌సీటీసీ రూపొందించిన హైదరాబాద్ టు అండమాన్ టూర్ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి.5 రాత్రులు, 6 పగళ్ళ వ్యవధి గల ఈ టూర్ ప్యాకేజీలో పోర్ట్ బ్లెయిర్, నెయిల్ ఐలాండ్, హేవ్‌లాక్ ఐలాండ్, రాధానగర్ బీచ్ సహా పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.ఈ ప్యాకేజీ మార్చి 12న ప్రారంభం కానుంది. మొదటి రోజు ఉదయం 6.35 గంటలకు హైదరాబాద్‌లో విమానం ఎక్కి ఉదయం 9 గంటలకు పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత సెల్యులార్ జైలు మ్యూజియం, కార్బిన్స్ కోవ్ బీచ్ సందర్శించి, లైట్ అండ్ సౌండ్ షోను ఆస్వాదించవచ్చు. రెండో రోజు పోర్ట్ బ్లెయిర్ నుంచి హేవ్‌లాక్ ద్వీపానికి వెళ్లి రాధానగర్ బీచ్‌లో విహరించవచ్చు. మూడో రోజు హేవ్‌లాక్ ద్వీపంలోని కాలాపత్తర్ బీచ్ చూసిన తర్వాత ప్రీమియం క్రూయిజ్ ద్వారా నెయిల్ ఐలాండ్ చేరుకుంటారు. సాయంత్రం సీతాపూర్ బీచ్‌లో గడిపి రాత్రికి నెయిల్ ఐలాండ్‌లో బస చేస్తారు.నాలుగో రోజు భరత్‌పూర్ బీచ్‌లో స్విమ్మింగ్, బోట్ రైడ్, వాటర్ యాక్టివిటీస్‌లో పాల్గొనవచ్చు. అనంతరం క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్‌కు చేరుకుంటారు. ఐదో రోజు రోస్ ఐలాండ్, నార్త్ బే ఐలాండ్, సముద్రిక మెరైన్ మ్యూజియం సందర్శించి రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో బస చేస్తారు. ఆరో రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ అయి 9 గంటలకు పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.ప్యాకేజీ ధరల వివరాలు: సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.68,320, డబుల్ ఆక్యుపెన్సీకి ఒక్కొక్కరికి రూ.51,600, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.49,960గా నిర్ణయించారు. 5 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.42,950, 2 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్ లేకుండా రూ.39,525 వసూలు చేస్తారు.ఈ ప్యాకేజీలో స్నాక్స్, వాటర్ గేమ్స్, వ్యక్తిగత ఖర్చులు, లాండ్రీ, టిప్స్ వంటివి ఉండవు. విమాన ప్రయాణం, సందర్శన స్థలాల ప్రయాణ ఖర్చులు, ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం, స్టార్ హోటల్‌లో బస, సందర్శనా స్థలాలకు ప్రవేశ రుసుము, గైడ్ ఛార్జీలు ఈ ప్యాకేజీలో కలిపి ఉంటాయి. 

  • Related Posts

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌