‘హైడ్రా’ పేరుతో వసూళ్ల దందా.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

నేటి భారత్ న్యూస్-హైడ్రా పేరుతో ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు వ‌సూళ్ల దందా న‌డిపిస్తున్నార‌ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మూసీ పేరుతో పేదల ఇళ్ల‌పై పగబ‌ట్టార‌ని ఆరోపించారు. ఈ మేర‌కు కేటీఆర్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీరును విమ‌ర్శిస్తూ పోస్టు పెట్టారు. ఫోర్త్ సిటీ పేరుతో ముఖ్య‌మంత్రి ఫ్యామిలీ రియ‌ల్ వ్యాపారం చేస్తోంద‌ని మాజీ మంత్రి దుయ్య‌బ‌ట్టారు. ట్రిపుల్ ఆర్ పేరుతో పేదల భూముల ఆక్రమణకు పాల్ప‌డుతున్నారని ఫైర్ అయ్యారు. పేద‌ల‌పై ప్ర‌తాపం చూపిస్తూ పెద్ద‌ల‌తో ఒప్పందం చేసుకుంటార‌ని విమ‌ర్శించారు. ఆరు గ్యారంటీలు గాలికి వదిలేసి, ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుభరోసా రాదు.. రుణమాఫీ కాదన్నారు. అలాగే పంటలు కొనుగోలు చేయర‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా ఎదిగిన తెలంగాణను 15 నెల‌ల కాంగ్రెస్ పాల‌న‌లో రాష్ట్రాన్ని పాతాళానికి తీసుకెళ్లార‌ని మండిప‌డ్డారు. ఇది పాలన కాదు పీడన అని అన్నారు. అలాగే ఇది సర్కారు కాదు సర్కస్ కంపెనీ అని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌లు మేల్కోవాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు.  

Related Posts

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

నేటి భారత్ న్యూస్- తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద డీఈఓ, ఎంఈఓ, త‌హ‌సీల్దారుల ఫోన్ నంబ‌ర్లు ఉంచారు. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే వారి దృష్టికి తీసుకెళ్లాల‌ని…

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

నేటి భారత్ న్యూస్- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమ‌ల‌ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి శ్రీవారి సేవ‌లో పాల్గొన్నారు. ఆయనతో పాటు అర్ధాంగి నారా భువనేశ్వరి, కుమారుడు రాష్ట్రమంత్రి నారా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

 ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

 ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

 ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం