‘మ్యాట్రిమోనీ’ మోసగాడు.. పెళ్లి పేరుతో మహిళలకు వల.. ఆపై డబ్బులు దండుకుని పరార్!

నేను ఎన్నారై, అమెరికాలో అమ్మ పెద్ద డాక్టర్.. ఆమె ఇండియాకు రాగానే పెళ్లి చేసుకుందాం అంటూ మ్యాట్రిమోనీ తరహా వెబ్‌సైట్లలో తప్పుడు సమాచారంతో అమ్మాయిలను మోసం చేసి వారి నుంచి డబ్బులు దండుకునే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్‌ హర్ష చెరుకూరి బీటెక్ చదవడానికి 2014లో హైదరాబాద్‌కు చేరుకున్నాడు. బీటెక్ మధ్యలోనే ఆపేసి 2015లో ఆన్‌లైన్‌ గేమింగ్, బెట్టింగ్‌ వంటి జూదాలకు అలవాటుపడ్డాడు. అంతే కాకుండా జాబ్ కన్సల్టెన్సీ పేరుతో కొంత మందిని మోసం చేసిన కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆ తరువాత సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి తన ఆదాయంలో ఎక్కువగా సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేశాడు. అలా దాదాపు వెయ్యి మంది నుంచి డబ్బు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా యానాంకు చెందిన ఓ ఎమ్మెల్యే ఫొటోను తన సోషల్ మీడియాలో డీపీగా పెట్టుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 50 మంది నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేశాడు. ఈ కేసుల్లో పలు మార్లు అరెస్టు అయి జైలుకు వెళ్లివచ్చినా ఇతనిలో ఎటువంటి మార్పు రాలేదు. ఆ తర్వాత మోసాలకు పెళ్లి సంబంధాలను ఎంచుకున్నాడు. మ్యాట్రిమోనీ తరహా వెబ్‌సైట్‌లలో తప్పుడు సమాచారం పెట్టి.. రెండో పెళ్లి కోసం చూస్తున్న వారు, 30 ఏళ్ల వయసు దాటిన వారినే టార్గెట్‌ చేశాడు. వాట్సప్‌ కాల్‌ ద్వారా చాటింగ్, కాల్స్ ద్వారా మంతనాలు చేస్తూ తనమీద అమ్మాయిలకు నమ్మకం కలిగిన తర్వాత తన బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌ అయ్యాయని.. ఐటీ అధికారులు డబ్బు తీసుకెళ్లారని, కుటుంబ సభ్యులు ఆసుపత్రుల్లో ఉన్నారంటూ కట్టు కథలు చెప్పేవాడు. అలా ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల నుంచి 25 లక్షల వరకూ మోసం చేసేవాడు. కొన్నిరోజులకు బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే వారి ఫొటోలు మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో కొందరు తమ పరువు పోతుందని భయంతో మిన్నకుండిపోగా, ఇటీవల అతని వల్ల రూ. 11 లక్షలు మోసపోయిన జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని బెంగుళూరులో అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్‌కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాలతో జైలుకు తరలించారు. 

Related Posts

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

నేటి భారత్ న్యూస్- తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద డీఈఓ, ఎంఈఓ, త‌హ‌సీల్దారుల ఫోన్ నంబ‌ర్లు ఉంచారు. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే వారి దృష్టికి తీసుకెళ్లాల‌ని…

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

నేటి భారత్ న్యూస్- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమ‌ల‌ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి శ్రీవారి సేవ‌లో పాల్గొన్నారు. ఆయనతో పాటు అర్ధాంగి నారా భువనేశ్వరి, కుమారుడు రాష్ట్రమంత్రి నారా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

 ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

 ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

 ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం