అత్తగారింటికి, తన భూములున్న ప్రాంతానికి రేవంత్ రెడ్డి రోడ్డు వేసుకుంటున్నారు: హరీశ్ రావు

నేటి భారత్ న్యూస్- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అత్తగారిల్లు, ఆయన భూములు ఉన్న ఆమన్‌గల్‌కు రూ. 5 వేల కోట్లతో రోడ్డు ఎలా వేస్తున్నారో చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. రైతుబంధు ఇచ్చేందుకు డబ్బులు లేవని పదేపదే చెబుతున్నారని, కానీ హెచ్ఎండీఏలో రూ. 20 వేల కోట్లతో టెండర్లు ఎలా పిలుస్తున్నారని ఆయన నిలదీశారు. రుణమాఫీపై దేవుళ్ల మీద ఒట్టేసి ముఖ్యమంత్రి మోసం చేశారని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో రుణమాఫీపై ప్రశ్నిస్తే ప్రతిదాడులు, సస్పెన్షన్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బయట ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ సహా వివిధ హామీలపై కాంగ్రెస్ నేతలను రైతులు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. వడగండ్ల వాన వల్ల రైతులందరూ నష్టపోయారని, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేలు నష్టపరిహారం చెల్లించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. శాసనసభను వేదిక చేసుకొని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

నేటి భారత్ న్యూస్- ఒవైసీ వంటి వారు వంద మంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపలేరని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒవైసీ తాత వచ్చినా ఈ బిల్లు ఆగదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని…

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

నేటి భారత్ న్యూస్- హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇక్కడి కింగ్స్ ప్యాలెస్‌లో జరుగుతున్న ‘ఆనం మీర్జా’ ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుకాణదారుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.