ఏనుగుల దాడిలో చ‌నిపోయిన మృతుల కుటుంబాల‌కు రూ.10ల‌క్ష‌ల‌ ప‌రిహారం: డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌

నేటి భారత్ న్యూస్- ఏపీలోని అన్న‌మ‌య్య జిల్లా ఓబుల‌వారిప‌ల్లె మండ‌ల ప‌రిధిలోని గుండాల‌కోన‌లో ఉన్న శివాల‌యానికి మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా 14 మంది భ‌క్తులు సోమ‌వారం రాత్రి కాలిన‌డ‌క‌న అట‌వీ మార్గంలో వెళ్తున్న స‌మ‌యంలో ఏనుగుల గుంపు వారిపై దాడి చేసింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు భ‌క్తులు చ‌నిపోగా, మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై తాజాగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసిందన్నారు. అట‌వీ శాఖ అధికారుల‌ను ఈ ఘ‌ట‌న గురించి అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ. 10ల‌క్ష‌ల చొప్పున, గాయ‌ప‌డిన వారికి రూ. 5ల‌క్ష‌ల చొప్పున‌ ప‌రిహారం ప్ర‌క‌టించారు. అలాగే క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య‌సేవ‌లు అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా అట‌వీ ప్రాంతాల్లో ఉన్న శివాల‌యాల‌కు వెళ్లే భ‌క్తుల‌కు త‌గిన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేయాల‌ని ప‌వ‌న్ అధికారుల‌ను సూచించారు. ఈ ఘ‌ట‌న‌పై సీఎం చంద్ర‌బాబు కూడా తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి ధైర్యం ఇవ్వాల‌ని స్థానిక ఎమ్మెల్యేల‌ను కోరారు. బాధిత కుటుంబాల‌కు అండ‌గా ఉంటామ‌ని చంద్ర‌బాబు భ‌రోసా ఇచ్చారు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌