మెగాస్టార్ చిరంజీవిపై సాయి ప‌ల్ల‌వి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

నేటి భారత్ – నేచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను చిన్న‌ప్పుడు చిరు డ్యాన్స్ చూసి ఫిదా అయ్యి, డ్యాన్స‌ర్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సాయి ప‌ల్ల‌వి మాట్లాడుతూ… “నేను చిన్న‌ప్పుడు చిరంజీవి న‌టించిన ‘ముఠామేస్త్రి’ సినిమా తెగ చూసేదాన్ని. ఆయ‌న డ్యాన్స్‌కి ఫిదా అయ్యాను. ఆ త‌ర్వాత డ్యాన్స‌ర్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అలా డ్యాన్స్‌పై ఆస‌క్తితో వివిధ షోల‌లో పాల్గొన్నాను. ఒక ఈవెంట్‌లో చిరుతో డ్యాన్స్ చేయ‌డం నాకు జీవితాంతం మ‌రిచిపోలేని జ్ఞాప‌కం” అని సాయి ప‌ల్ల‌వి చెప్పుకొచ్చారు.కాగా, ఇటీవ‌ల తెలుగులో ‘తండేల్’ మూవీతో ఆమె సూప‌ర్ హిట్ అందుకున్న విష‌యం తెలిసిందే. ‘ఫిదా’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సాయి ప‌ల్ల‌వి… ‘ఎంసీఏ’, ‘ల‌వ్‌స్టోరీ’, ‘శ్యామ్‌సింగ‌రాయ్’ వంటి చిత్రాల‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ర‌ణ‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న ‘రామాయ‌ణ’ మూవీలో సీత‌గా న‌టిస్తున్నారు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌