ఆర్బీఐ కీలక నిర్ణయం

నేటి భారత్ న్యూస్- దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నిధులను జొప్పించేందుకు ఆర్బీఐ మరోసారి చర్యలు ప్రకటించింది. ఏ విధంగా బ్యాంకింగ్ వ్యవస్థలకు నిధులు అందుబాటులోకి తీసుకొస్తామనే ప్రక్రియను వెల్లడించింది. బహిరంగ మార్కెట్ కార్యక్రమాల ద్వారా సెక్యూరిటీ‌ల కొనుగోలు, డాలర్, రూపాయి స్వాప్ వంటి చర్యల ద్వారా నెల రోజుల్లో మొత్తం రూ.1.9 లక్షల కోట్లు బ్యాంకులకు అందుబాటులోకి తీసుకురావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న పది బిలియన్ డాలర్లకు సమానమైన డాలర్ – రుపాయి స్వాప్ వేలాన్ని నిర్వహించిన ఆర్బీఐ .. లిక్విడిటీని మరింత పెంచాలని మరోసారి చర్యలు తీసుకుంది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా మొత్తం రూ.1 లక్ష కోట్లకు సమానమైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తామని ఆర్బీఐ ప్రకటించింది. రూ.50వేల కోట్ల చొప్పున రెండుసార్లుగా మార్చి 12, మార్చి 18 తేదీల్లో ఈ సెక్యూరిటీస్ కొనుగోళ్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు మార్చి 24న మరో పది బిలియన్ డాలర్ల యూఎస్డీ, ఐఎన్ఆర్ బై, సెల్ స్వాప్ వేలాన్ని కూడా నిర్వహించనుంది. నగదు లభ్యతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ తెలిపారు. 

Related Posts

 ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చిన కెనడా కొత్త ప్రధాని

నేటి భారత్ న్యూస్- కెనడా నూతన ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మార్క్ కార్నీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చారు. కెనడాని అమెరికాలో విలీనం చేసుకుంటామని ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కెనడా ఎప్పటికీ…

ఏనాడైనా ప్రజల్లో తిరిగారా..? జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్

నేటి భారత్ న్యూస్- ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఏనాడూ ప్రజల్లో తిరగలేదని, ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకునేవారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఆరోపించారు. ఐదేళ్ల పాలన తర్వాత పది లక్షల కోట్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చిన కెనడా కొత్త ప్రధాని

 ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చిన కెనడా కొత్త ప్రధాని

ఏనాడైనా ప్రజల్లో తిరిగారా..? జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్

ఏనాడైనా ప్రజల్లో తిరిగారా..? జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్

పారిశుద్ధ్య కార్మికుల‌తో సీఎం చంద్ర‌బాబు ముఖాముఖి

పారిశుద్ధ్య కార్మికుల‌తో సీఎం చంద్ర‌బాబు ముఖాముఖి

 విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

 విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

బయలుదేరిన ఫాల్కన్ 9 రాకెట్.. త్వరలోనే భూమ్మీదకు సునీతా విలియమ్స్

బయలుదేరిన ఫాల్కన్ 9 రాకెట్.. త్వరలోనే భూమ్మీదకు సునీతా విలియమ్స్

 వెంకటపాలెంలో శ్రీనివాస కల్యాణం… మంత్రి నారా లోకేశ్ కు టీటీడీ ఆహ్వానం

 వెంకటపాలెంలో శ్రీనివాస కల్యాణం… మంత్రి నారా లోకేశ్ కు టీటీడీ ఆహ్వానం