పారిశ్రామిక వర్గాల్లో ప్రభుత్వంపై విశ్వాసం: ఏపీ మంత్రి టీజీ భరత్

నేటి భారత్ న్యూస్- ఆరు నెలల క్రితం పారిశ్రామిక వేత్తలు తమను కలిసినప్పుడు 1947లో స్వాతంత్య్రo చూశామో లేదో కానీ, ఈ ప్రభుత్వం వచ్చాకే నిజమైన స్వాతంత్య్రo చూశామని చెప్పారని ఏపీ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ అన్నారు. అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మాట్లాడడానికి కానీ లేదా ఏదైనా విషయం అడగడానికి కానీ వీలు కలిగిందని పారిశ్రామికవేత్తలు చెప్పారని మంత్రి తెలిపారు. పారిస్‌లో చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఇండియాలో ఎక్కడైనా పరిశ్రమలు పెట్టండి కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిశ్రమలు పెట్టకండని మాట్లాడే దుస్థితికి గత పాలకులు తెచ్చారన్నారు. గత ఎనిమిది నెలల్లో పారిశ్రామిక వర్గాల్లో తమ ప్రభుత్వం ఒక విశ్వాసాన్ని కలిగించిందన్నారు. సుమారు 6.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారన్నారు. లక్షల ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడతాయన్నారు. చాలా మంది సభ్యులు పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలని, పరిశ్రమలు తెప్పించాలని కోరుతున్నారన్నారు. సభ్యులు విజయ్ కుమార్ రాజు, యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణ చైతన్య, ఈశ్వరరావు చెప్పిన అంశాలను తాను, తమ ప్రిన్సిపల్ సెక్రెటరీ నోట్ చేసుకున్నామని.. దాన్ని పారిశ్రామికవేత్తలతోనూ, తమ సమీక్షలలోను కచ్చితంగా చర్చించి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటామని మంత్రి టి.జి భరత్ హామీ ఇచ్చారు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌