గిల్ ను బౌల్డ్ చేసిన తర్వాత ‘ఇక వెళ్లు..’ అన్నట్లుగా సైగ చేసిన అబ్రార్..

నేటి భారత్ న్యూస్- ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 241 పరుగులు చేసింది. ఓపెనర్ గా వచ్చిన రోహిత్ శర్మ 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి శుభ్ మన్ గిల్ ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. అయితే, పాక్ స్పిన్ బౌలర్ అబ్రార్ అద్భుతమైన బంతితో గిల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. గిల్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేసినా బంతి బ్యాట్ పక్కనుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది.దీంతో హాఫ్ సెంచరీకి మరో నాలుగు పరుగుల దూరంలో వున్న గిల్ పెవిలియన్ బాట పట్టాడు. అయితే, ఈ సందర్భంగా పాక్ బౌలర్ అబ్రార్ భారత బ్యాట్స్ మన్ గిల్ ను చూస్తూ ‘ఇక వెళ్లు.. వెళ్లు’ అన్నట్లు సైగ చేయడం కెమెరాలో రికార్డైంది. చేతులు రెండూ కట్టుకుని తల తిప్పుతూ సైగలు చేయడం, పక్కనే ఉన్న ముహమ్మద్ నవ్వడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌