జగన్ ప్రాణాలకు ముప్పు ఉంది: మోదీ, అమిత్ షాకు మిథున్ రెడ్డి లేఖ

నేటి భారత్ న్యూస్ – వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన సందర్భంగా అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించిందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లేఖ రాశారు. జగన్ కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లేఖలో ఆయన కోరారు. ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ కు భద్రత కల్పించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని లేఖలో మిథున్ రెడ్డి ఆరోపించారు. మిర్చి యార్డు పర్యటనకు వెళ్లిన జగన్ కు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని విమర్శించారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్న జగన్ కు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.  ఇటీవల జగన్ నివాసం వద్ద కూడా కొన్ని ఘటనలు జరిగాయని మిథున్ రెడ్డి తెలిపారు. కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని… జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రతా వైఫల్యం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రమాదకర ధోరణికి తెరలేపుతోందని అన్నారు. మిథున్ రెడ్డి లేఖపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.మరోవైపు, ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ ను వైసీపీ నేతలు కలిశారు. గుంటూరు పర్యటనలో జగన్ కు తగిన రక్షణ కల్పించలేదని ఆయనకు ఫిర్యాదు చేశారు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌