మంద కృష్ణతో విభేదాలు లేవు, ఆయన నాకంటే మోదీని ఎక్కువగా నమ్ముతున్నారు: రేవంత్ రెడ్డి

నేటి భారత్ న్యూస్- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆయన తనకంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎక్కువగా విశ్వసిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం గట్టి వాదనలు వినిపించిందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో బలమైన వాదనలతో అత్యున్నత న్యాయస్థానాన్ని మెప్పించామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్నచోట ఎస్సీ వర్గీకరణను అమలు చేయలేదని ఆయన విమర్శించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఎస్సీలకు న్యాయం చేయాలని బలంగా సంకల్పించానని, అందరితో సమన్వయం చేసుకుంటూ శాసనసభలో ఏకాభిప్రాయం సాధించామని ముఖ్యమంత్రి అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకించే సాహసం ఎవరూ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ తీర్మానం పెట్టాలని 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో తాను చెప్పానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్రానికి తీర్మానం పంపించాలని కోరామని ఆయన అన్నారు. తీర్మానం ప్రవేశపెడితే తనతో పాటు సండ్ర వెంకటవీరయ్య, సంపత్‌లను సభ నుండి బహిష్కరించారని ఆయన తెలిపారు. తాము పెట్టిన తీర్మానాన్ని విధిలేని పరిస్థితుల్లో అప్పట్లో సభ ఏకగ్రీవంగా ఆమోదించిందని ఆయన గుర్తు చేశారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళతామని చెప్పి ఏనాడూ తీసుకువెళ్లలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్త్వరలో ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. పిల్లలను కోచింగ్‌లకు సన్నద్ధం చేయాలని సూచించారు. పిల్లలను బాగా చదివించాలని, విదేశాలకు కూడా పంపించాలని ఆయన అన్నారు. ఎల్లప్పుడూ మన ఊర్లోనే, మన ఇళ్లలోనే ఉండకుండా విదేశాలకు వెళ్లాలని ఆయన సూచించారు.

Related Posts

 ఈ నెల 29 న సూర్యగ్రహణం.. ఏయే దేశాల్లో కనిపిస్తుందంటే..?

నేటి భారత్ న్యూస్- కొత్త ఏడాదిలో తొలి సూర్యగ్రహణం ఈ నెల 29న ఏర్పడనుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అయినప్పటికీ భూమిపై నుంచి చూస్తే పాక్షికంగానే కనిపిస్తుందని వివరించారు. అదేవిధంగా ప్రపంచంలో కొన్ని దేశాలలో మాత్రమే గ్రహణం…

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతం… కానీ ఆ విష‌యం న‌న్ను బాధించింది: రాజ‌మౌళి

నేటి భారత్ న్యూస్- టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కాంబినేష‌న్‌లో ‘ఎస్ఎస్ఎంబీ 29’ ప్రాజెక్టు తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఈ మూవీ ఒడిశాలో షూటింగ్ జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భంగా జ‌క్క‌న్న ఒడిశాలోని ప్ర‌ఖ్యాత…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 ఈ నెల 29 న సూర్యగ్రహణం.. ఏయే దేశాల్లో కనిపిస్తుందంటే..?

 ఈ నెల 29 న సూర్యగ్రహణం.. ఏయే దేశాల్లో కనిపిస్తుందంటే..?

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతం… కానీ ఆ విష‌యం న‌న్ను బాధించింది: రాజ‌మౌళి

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతం… కానీ ఆ విష‌యం న‌న్ను బాధించింది: రాజ‌మౌళి

నాగార్జున డ్యామ్ సమీపంలో అగ్నిప్రమాదం

నాగార్జున డ్యామ్ సమీపంలో అగ్నిప్రమాదం

ఐపీఎల్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ బ్రూక్‌పై రెండేళ్ల నిషేధం.. స్పందించిన ఆసీస్ మాజీ కెప్టెన్

ఐపీఎల్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ బ్రూక్‌పై రెండేళ్ల నిషేధం.. స్పందించిన ఆసీస్ మాజీ కెప్టెన్

 అశోక్ లేలాండ్ బస్ తయారీ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

 అశోక్ లేలాండ్ బస్ తయారీ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

హైదరాబాదులో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు ..తెలంగాణ సర్కార్‌తో కీలక ఒప్పందం

హైదరాబాదులో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు ..తెలంగాణ సర్కార్‌తో కీలక ఒప్పందం