ముగిసిన మహా కుంభమేళా.. మళ్లీ ఎప్పుడు?

నేటి భారత్ న్యూస్- ప్రపంచంలోనే అతిపెద్ద మత సమ్మేళనమైన మహాకుంభమేళా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌‌లో 45 రోజులపాటు జరిగిన ఈ వేడుక బుధవారం మహాశివరాత్రితో పరిసమాప్తమైంది. ఈసారి దాదాపు 66 కోట్ల మంది భక్తులు గంగ, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానమాచరించి సరికొత్త రికార్డు సృష్టించారు. అమెరికా జనాభా 34 కోట్ల మంది కాగా, అంతకు రెట్టింపు సంఖ్యలో కుంభమేళాకు భక్తులు తరలిరావడం విశేషం. మళ్లీ ఎప్పుడు?మహాకుంభమేళా ముగియడంతో తర్వాతి కుంభమేళా ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందని తెలుసుకోవాలన్న ఆసక్తి కలగడం సహజమే. వచ్చే కుంభమేళా 2027లో మహారాష్ట్రలోని నాసిక్‌లో జరుగుతుంది. నాసిక్‌కు 38 కిలోమీటర్ల దూరంలోని గోదావరి పుట్టినిల్లు అయిన త్రయంబకేశ్వరంలో జరుగుతుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శివాలయం ఇక్కడే ఉంది. 2027లో జులై 17 నుంచి ఆగస్టు 17 వరకు కుంభమేళా జరుగుతుంది. నాసిక్ కుంభమేళాలో కటింగ్ ఎడ్జ్ సాంకేతికతను ఉయోగిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.  వచ్చే మూడేళ్లలోనే మరో కుంభమేళా ఎందుకు? కుంభమేళాలు ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో ప్రతి మూడేళ్లకు ఒకసారి ఒక్కో నగరంలో జరుగుతాయి. నాలుగేళ్లకు ఒకసారి జరిగే దానిని కుంభమేళా అని, ఆరేళ్లకు ఒకసారి జరిగే దానిని అర్ధ కుంభమేళా అని పిలుస్తారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే దానిని పూర్ణ కుంభమేళా అని, 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే దానిని మహాకుంభమేళా అని వ్యవహరిస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు
ఈసారి మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు, భక్తులు హాజరయ్యారు. ఇక, మన ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ హాజరయ్యారు. అలాగే, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, కోల్డ్ ప్లే సింగ్ క్రిస్ మార్టన్ తదితరులు కుంభమేళాకు హాజరై పుణ్య స్నానాలు ఆచరించారు. అలాగే, 77 దేశాలకు చెందిన 118 మంది దౌత్యవేత్తలు కూడా కుంభమేళాకు హాజరయ్యారు.

  • Related Posts

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

    నేటి భారత్ న్యూస్- విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో భాగంగా గుజరాత్ జెయింట్స్ విమెన్ జట్టుతో ముంబైలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ విమెన్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన…

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

    నేటి భారత్ న్యూస్- గత కొంతకాలంగా చుక్కల్లో విహరిస్తున్న బంగారం ధరలు మరోమారు భగ్గుమన్నాయి. దేశీయ విపణిలో తొలిసారి నిన్న రూ. 90 వేల మార్కును చేరుకుని జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నిన్న 10 గ్రాముల బంగారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌