

నేటి భారత్ న్యూస్- విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో మార్చి 5, 6 తేదీల్లో నాస్కామ్, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఈ కెరీర్ ఫెయిర్లో ఐటీ, ఐటీఈఎస్ 49 కంపెనీలతో యువతీ, యువకులకు సుమారు 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరించారు. 2024, 2025లో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ, యువకులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాస్కామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఉప్మిత్ సింగ్, నేషనల్ లీడ్ ఉదయ్ శంకర్, ఏపీ లీడ్ ప్రవీణ్ కుమార్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.